Posts

Showing posts from February, 2021

సత్యాన్వేషన దినం

  ఫిబ్రవరి 17, 1600 సంవత్సరం. ఇటలీలోని రోమ్‌ నగరం, కాంపోడి ఫియోరి కూడలి అక్కడికి ఖగోళ సిద్ధాంత కర్త, గణిత శాస్త్రజ్ఞుడు అయిన గియార్డనో బ్రూనోను రెక్కలు విరిచికట్టి నాలుక తీగతో చుట్టి తీసుకొచ్చారు. నాలుకకు చుట్టిన తీగ విప్పేసి, చివరిసారి అడిగారు. ''తప్పులన్నీ ఒప్పుకో! ప్రాణభిక్ష పెడతాం!'' అన్నారు రోమన్‌ మత న్యాయస్థానం పెద్దలు. బ్రూనో తల అడ్డంగా తిప్పాడు. తను ఏ తప్పు చేయలేదని నిర్భయంగా చెప్పాడు. ఏ మాత్రం తొణకలేదు. శిక్ష అనుభవించడానికి సిద్ధం అన్నట్టుగా నిలబడ్డాడు. 'నేను చెప్పిన నిజాలు తరతరాలుగా మీ లాంటి మూర్ఖుల్ని తొలుస్తూనే ఉంటాయి' అన్న మనో నిబ్బరం ఆయనది. మత న్యాయస్థానం అధికారులు, రాజ్యాధినేతలు అందరూ ఆత్రంగా ఎదురు చూశారు. ఆ చివరి క్షణంలో నైనా దాసోహమంటాడేమోనని ఆశపడ్డారు. కానీ వారి ఆశ నిరాశే అయ్యింది. సత్యస్థాపన కోసం తను ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనన్నట్టు, వారివైపు బ్రూనో జాలిగా చూశాడు. 'ఏమిటీ విచిత్రం? గాలీ, వెలుతురూ లేని చీకటి గదిలో ఏడేండ్లు బంధించినా, రోజూ చిత్రహింసలు పెట్టినా, క్రమం తప్పకుండా మానసికంగా వేధించినా బ్రూనోలో ఏమాత్రం మార్పు రాలేదేమి అని మతాధికారుల...

ఎవరూ ఎవ్వర్నీ మార్చలేరు

ఎవరూ ఎవ్వర్నీ మార్చలేరు, ఆలోచించేలా మాత్రమే చేయగలరు ఎవరికి వారే మారాలి. ఒకరు చెపితే మారేవారు, వేరే వారు వేరేలా చెపితే వేరేలా మారవచ్చు. ఒత్తిడితో మార్పు తెస్తే, ఒత్తిడి ఉన్నంత కాలం మాత్రమే ఆ మార్పు ఉంటుంది ఎవరినైనా ఆలోచించే వారిగా ప్రశ్నించే వారిగా, నిజం తెలుసుకునే వారిగా, శాస్త్రీయ దృక్పథం ఏర్పరుచుకునే వారిగా ప్రోత్సాహించాలి. హేతువాదిగా ఉండాలి అనుకుంటే ఎవరికి వారే హేతుబద్దంగా ఆలోచించాలి. అందరికీ ప్రశ్నించే తత్వం రావాలి, ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. ప్రపంచంలో ఆలోచించే వాళ్ళు తక్కువ, అనుకరించే వాళ్ళు ఎక్కువ. అందుకే మతాలు ప్రాభల్యం పెరగడానికి అనుకరణే ఒక కారణం. ప్రజల్లో ప్రశ్నించే తత్వం, శాస్త్రీయ దృక్పధం లోపించడం కూడా దేశం వెనుకబాటు తనాన్నికి ఒక కారణం

నికోలస్ కోపర్నికస్ జయంతి

మధ్యయుగానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. శాస్త్రీయంగా సూర్యకేంద్ర సిధ్ధాంతాన్ని నిరూపిస్తూ సిద్ధాంతీకరించిన నికోలస్ కోపర్నికస్ జయంతి పిబ్రవరి 19. కోపర్నికస్ గురించి క్లుప్తంగా....కె కె వి నాయుడు. ఫిబ్రవరి 19 ,1473 లో ధార్న్ అనే పట్టణంలో  కోపర్నికస్  జన్మీంచాడు. తండ్రి వర్తక వాణిజ్య పరిజ్ఞానము,పినతండ్రి మత సంబంధమైన వ్యవహార జ్ఞానము కోపర్నికస్ పై బాగా ప్రభావాన్ని చూపాయి. 1492 లో ఈయన క్రాకోవ్ విశ్వ విద్యాలయంలో చేరాడు. ఆల్బెర్ట్ బ్రుడ్జ్ విస్కీ దగ్గర శిష్యరిక నెరిపాడు. ఇటలీలో బొలోగ్నావిశ్వవిద్యాలయంలో  న్యాయ శాస్త్రం,గణిత శాస్త్రము,  ఖగోళశాస్త్రము  అభ్యసించాడు. గ్రీకు భాష నేర్చుకుని ఎన్నో గ్రంథాలను కంఠస్థం చేశాడు. రోమ్ విశ్వవిద్యాలయంలో 29 ఏళ్ళ వయస్సులో 1502 లో ఖగోళ శాస్త్ర నిపుణుడిగా చేరాడు. విశ్వానికి కేంద్రం భూమి,సూర్యుడు, ఈ రెంటిలో ఏది? అనే అనుమానం పట్టుకుంది.          అరిస్టాటిల్, టోలెమీకు భూ కేంద్రక సిద్ధాంతం  బలపరి చారు.  పైథాగరస్ సూర్య కేంద్రక సిద్ధాంతమే సరి అయిందని నమ్మాడు. ఏది నమ్మాలో,ఏది నమ్మకూడదో కోపర్నికస్ కు అర్థం క...

ప్రముఖ శాస్త్రవేత్తల జయంతులు,వర్ధంతులకు ప్రాధాన్యత

గెలిలియో స్పూర్తితో రచయిత-యమ్.రాం ప్రదీప్ సాధారణంగా సంఘ సంస్కర్తలకి,స్వాతంత్ర సమర యోధులకి ఉన్న ప్రాధాన్యత క్షేత్ర స్థాయిలో శాస్త్రవేత్తలకి లభించడం లేదు.కనీసం విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రముఖ శాస్త్రవేత్తల జయంతులు,వర్ధంతులు జరపడం లేదు.పాఠశాలల్లో వివిధ పండుగల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.శాస్త్రవేత్తల గురించి పరిచయం చేసే సందర్భాలు విద్యాలయాల్లో చాలా అరుదు.వారి విగ్రహాలు కూడా ఎక్కడా పెద్దగా కనిపించవు.ఎందరో శాస్త్రవేత్తలు తమ ప్రాణాలని సైతం త్యాగం చేసి అనేక విషయాలు కనుగొన్నారు.అటువంటి వారిలో గెలిలియో ఒకరు. గెలిలియో తన పరిశోధనలతో ఖగోళ శాస్త్రాన్ని కొత్త పుంతలు తొక్కించారు.ఆయన కోపర్ని కస్ ప్రతిపాదించిన సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని బలపరిచాడు.గురు,శనిగ్రహాల పై పరిశోధన చేసాడు.గెలీలియో ఎన్నో మూఢ నమ్మకాలను శాస్త్ర వాదనల ద్వారా ప్రయోగాల ద్వారా తొలగించ గలిగాడు. 20 సంవత్సరాల వయస్సప్పుడు ఈయన ఒక రోజు ప్రార్థన కోసం చర్చికి వెళ్ళాడు. చీకటి పడుతున్న వేళ అది. చర్చి సేవకుడు ఒకడు దీపాలు వెలిగిస్తున్నాడు. ఎన్నో దీపాలు చర్చి పైభాగం నుండి వ్రేలాడుతూ ఉన్నాయి. ఈ దీపాలు ఉయ్యాల మాదిరి అటు, యిటూ ఊగ...

మానవ నాగరికత లో నిప్పు పాత్ర

Image
భూమి ఏర్పడిన తర్వాత భూమిపై అనేక జీవరాసులు పరిణామక్రమంలో ఏర్పడ్డాయి .ఒక దశలో అత్యధిక హిమపాతం కలిగిన భూమిని అంతరిక్షం నుంచి వచ్చిన ఆస్టరాయిడ్ శకలాలు తగలడం వల్ల అనేక వృక్షాలు జంతువులు మరణించాయి. ఆ సందర్భంలో  భూమి పైన అనేక గడ్డి మైదానాలు ఏర్పడ్డాయి. ఉత్తరకెన్యా, ఈశాన్య ఇథియోపియాలో లేక్    రుడాల్ఫ్ గడ్డి మైదానాలలో మానవ పరిణామ క్రమం ప్రారంభమైందనిఅందరూ అంగీకరిస్తున్నారు. అప్పుడు కొన్ని వేల సంవత్సరాలుగా  నడిచే వానరాలు చెట్ల మీద నుంచి భూమి మీదికి ఆహార సేకరణ కోసం చాలా దూరం గడ్డి  మైదానాల పై నడుస్తూ  వెళ్లాల్సి వచ్చేది. ఆ క్రమంలో లో వానరాలు నిలబడటం అలవాటు చేసుకున్నాయి. వెనుక కాళ్ళు మొత్తం శరీరాన్ని మోయగల శక్తిని సంపాదించుకున్నాయి. కాలి వేళ్ళు భూమిని పట్టుకునేందుకు అనువుగా పాదం వెడల్పుగా తయారైంది. అప్పుడు ముందు కాళ్ళు స్వేచ్ఛను పొందాయి. కాలక్రమంలో అవి మనిషి చేతులు గా రూపాంతరం చెందాయి. చెట్లు ఎగబాకే టప్పుడు, పళ్ళు ,కాయలు దుంపలు ఏరుకొనేటప్పుడు, రాళ్లను ఉపయోగించేటప్పుడు జరిగిన శ్రమవల్ల చెయ్యి నిర్మాణం అభివృద్ధి చెందింది. రకరకాల వస్తువులు పట్టుకునేందుకు బొటనవేలు మిగతా వేళ్...

జీన్_డిఎన్ఏ_మ్యుటేషన్స్

      జీన్స్ గురించి 1951 లో జేమ్స్ వాట్సాన్, జేమ్స్ క్రూక్ సాయంతో డీ ఆక్సీరైటో న్యూక్లియక్ యాసిడ్(డి.ఎన్.ఏ) అనే జన్యువు (జీన్ ) గురించి పరిశోధించారు. వాళ్ళు కనుగొన్నదేమంటే డి.ఎన్.ఏ. ఒక న్యూక్లియక్ ఆమ్లమని, మన కణ కేంద్ర కాల్లోని మైటోకాండ్రియాలో ఉండే క్రోమోజోమ్ లో ఈ డీఎన్ఏ ఉండ చుట్టుకుని ఉంటుందని.          అతి సూక్ష్మ బ్యాక్టీరియా మొదలుకొని ఒకప్పటి రాక్షస బల్లుల వరకూ అన్ని జీవుల్లోని కణాల్లో ఉండే ప్రాథమి కమైన విషయం డీఆక్సీరైబో న్యూక్లిక్ యాసిడ్ క్లుప్తంగా డీఎన్ఏ.       1953 లో వాట్సన్, క్రిక్ లు ఇద్దరు శాస్త్రజ్ఞులు డి.ఎస్. ఎ స్వరూపాన్ని ఆవిష్కరించారు.ఇది రెండు గొలుసులు పెనవేసుకున్నట్టుగా ఉంటుంది. ఈ గొలుసులు ఒక చక్కెర కణం, ఒక పాస్పేట్ కణం పక్కన పక్కన చేరడం వల్ల ఏర్పడుతాయి.రెండు గొలుసులు మధ్య నాలుగు రకాల అణువులు షట్కోణాకారంలో అమరివుంటాయి. ఈ నాలుగు రకాల అణువులు - అడినైన్, గ్వానైన్, థయమిన్, సైటోసైన్.మనం ఎంత పొడవు పెరగాలి? కళ్ల రంగు ఏంటి? వచ్చే జబ్బులేవి? వంటి అన్ని రకాల సమాచారం దీంట్లోనే ఉంటుంది.డి.ఎన్.ఏ. కు ఒక నిర్దిష్టమైన కాలపరిమితి ఉ...

సౌర వ్యవస్థ ఆవిర్భావం

Image
సౌర వ్యవస్థ ఆవిర్భావం          pc: YouTube  వినీలాకాశంలో   రాత్రి పూట కనిపించే నక్షత్రాలు, చందమామ, పగలు కనిపించే సూర్యుడు,మనం నివసించే భూమి ఇవన్నీ విశ్వం అనుకున్నాడు మనిషి మొదట్లో.  దీన్ని అంతరిక్షం,రోదసి,గగనం మొదలైన పేర్లతో పిలిచేవాడు.వీటి  కదలికలను అధ్యయనం చేశాడు గానీ వీటి ద్వారా   విశ్వం గురించి కొంచెం కొంచెం తెలిసింది గానీ కచ్చితంగా తెలుసుకోవడానికి గెలీలియో దూరదర్శన్ ని కనుగొన్నది వరకు వేచి ఉండాల్సి వచ్చింది  .        విజ్ఞాన వికసిస్తున్న తొలి దశలో,  గడియారాలు కొనుక్కోక ముందు సూర్యుని వెలుగు లో భూమి పై మనిషి  నీడల ను బట్టి  టైమెంతయిందో తెలుసుకునేవారు. నక్షత్రాల కదలికలను బట్టి రాత్రి సమయాన్ని అంచనా వేసేవారు. ఆకాశంలోని నక్షత్రాలు,ఇతర గ్రహాలు, చంద్రుని  కదలికల పరిశీలన ఆధారంగానే కేలండర్లూ, పంచాంగాలూ వెలిశాయి.  అయితే పాత జ్ఞానాన్ని పూర్వం   పూర్వపక్షం చేసేవారు. దీనిని మీమాంస అన్నారు. ఇలా శాస్త్రవిజ్ఞానం అభివృద్ధి చెందింది. ఏ మధ్య యుగాలలో రాచరిక వ్యవస్థ ఏర్పడ...

భూమి ఎలా ఏర్పడింది

భూమి ఎలా ఏర్పడింది?...          విశ్వంలో ఉండేదంతా పదార్ధమే.మన  భూమి, గ్రహాలు, సూర్యుడు, నక్షత్రాలు, గాలాక్సీలు అన్నీ పదార్ధమే.ఈ పదార్థ పరిణామంలో భాగంగానే భూమి పుట్టింది.      సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఒక ఆదిమ పదార్థం మహా విస్ఫోటం (big bang) చెందటం తో ఈ విశాల విశ్వం (universe) ఏర్పడింది.ఆ ప్రేలుడు దెబ్బ కు అది వేగంగా విస్తరించడం మొదలుపెట్టింది.ఆ క్రమంలో ధూళికణాలు లతో కూడిన  వాయు మేఘాలు ఒకేచోట దట్టంగా పేరుకున్నాయి. వాటిని గేలక్సీ లన్నారు. ఆ గేలేక్సీలే  నక్షత్ర రాశులు. అవి తాము తిరుగుతూ వేగంగా ఇప్పటికీ ఎక్కడికో కదలుతూనే ఉన్నాయి. ఆ గేలెక్సీలో ఒక గుంపు నక్షత్రాలను పాలపుంత ( నెబ్యులా) అన్నారు.అలాంటివి చాలా ఉన్నాయి. మన మున్న పాలపుంత లో మన సూర్యుడు ఒక నక్షత్రం. విస్పోటనం అంటే ప్రేలుడు జరిగిన ప్పుడు వెదజల్లబడిన  వాయు మేఘాలు చిందరవందరగా తిరుగుతూ తిరుగుతూ సూర్యుని గా మారిన ఒక అతి పెద్ద వాయుమేఘం చుట్టూ ధూళి కణాల మధ్య నున్న ఆకర్షణ కారణంగా పరిభ్రమణం అంటే తిరగుతూ ఉండేవి. ఈ వాయు మేఘాల్లో  హైడ్రోజన్, హీలియంలాంటి తేలికైన వాయువ...

మన సౌర కుటుంబానికి ఆవల గ్రహాలు

Image
సౌర కుటుంబానికి ఆవల గ్రహాలను గుర్తించడం కొత్తేమీ కాదు. 1995లోనే సూర్యుడి లాంటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఓ గ్రహాన్ని గుర్తించారు.  మైకేల్ మేయర్, డిడీర్ క్వెలోజ్లు తొలిసారి సౌరకుటుంబానికి ఆవల మన పాలపుంతలోనే ఇంకో గ్రహం ఉన్నట్లు గుర్తించారు. ఫ్రాన్స్ లోని హాట్ ప్రావిన్స్ అబ్బర్వేటరీలో పరిశోధనలు చేసిన వీరు గుర్తించిన తొలి ఎక్సోప్లానెట్ పేరు పెగాసీ 512. ఇది మన గురు గ్రహాన్ని పోలి ఉంటుంది. అప్పటివరకూ సౌర కుటుంబానికి ఆవల గ్రహాలుండవన్న అంచనాతో ఉన్న భౌతిక శాస్త్రవేత్తలు ఆ తరువాత బోలెడన్ని పెద్ద గ్రహాలను గుర్తించారు. నాసా ప్రయోగించిన హబుల్ కెప్టర్ టెలిస్కోపులు పంపిన సమాచారం ఆధారంగా చూస్తే ఇప్పటివ రకూ సుమారు 4000 ఎక్సో ప్లానెట్లను గుర్తించినట్లు తెలుస్తుంది ఇదంతా ఆకాశంలో ఒక దిక్కున చిన్న ప్రాంతానికి సంబంధించినదే. ఆకాశం మొత్తాన్ని జల్లెడ పడితే వేల, లక్షల సంఖ్యలో ఎక్సోప్లానెట్లు గుర్తించవచ్చనేది అంచనా. గ్రహాల రూపురేఖలు, నిర్మాణాలపై శాస్త్రవే త్తలకు ఉన్న అవగాహన మొత్తాన్ని వీరిద్దరూ మార్చేశారనడంలో ఏమాత్రం సందేహం లేదు. చుట్టూ ఉన్న గ్రహాల గురుత్వాకర్షణ ప్రభా వానికి గురయ్యే నక్షత్రాల ర...

నక్షత్రాలు (Stars)

నక్షత్రాలు (Stars) నక్షత్రాలు పాలపుంతలో భాగమని. ఇలాంటివి విశ్వంలో లక్షల సంఖ్యలో ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు ఇలా విశ్వంలో అనేక వేల, కోట్ల నగ్త్రాల సముదాయాన్ని గెలాశీ లేదా నక్షత్ర మండలు అంటారు ఒక నక్త్ర మండలంలో ఒక మిలియన్ నుంచి ఒక బిలియన్ నక్ష త్రాల వరకు ఉండొచ్చు. ప్రస్తుతం విశ్వంలో సుమారు 88 గెలారీలు ఉన్నట్లు శాస్త్రవేత్తల అంచనా సూర్యుడు ఉన్న గెలాక్సీ ని పాలపుంత లేదా మిల్కీవే (Milkyway) అంటారు. మన పాలపుంతకు దగ్గరగా ఉన్న గెలాక్సీ ఆండ్రి మెడా. విశ్వంలానే హైడ్రా అతిపెద్ద గెలాక్సీ అని శాస్త్రజ్ఞులు  పేర్కొన్నారు. అన్ని పాలపుంతలు సర్పిలాకారంలో ఉంటాయి. ఒక నక్షత్రంలో కనీస ఉష్ణోగ్రత 10 లక్షల డిగ్రీల సెల్సియస్ ఉండాలి అందువల్ల నక్షత్రాలు స్వయం ప్రకాశక శక్తి కలిగి ఉంటాయి.ఇలా స్వయం ప్రకాశం కలిగి ఉన్న నక్షత్రాలు ఎ) పుడుతూనే ఉంటాయి బి) పెరుగుతూనే ఉంటాయి సి) పరిమాణంలో మార్పులు వస్తూనే ఉంటాయి డి) చివరికి మరణిస్తూనే వుంటాయి. స్వయం ప్రకాశశక్తి కలిగిన నక్షత్రాలకు భ్రమణ, పరి భ్రమణాలు కలిగి వేడి వెలుతురును ఇస్తాయి. ఎ) కాస్మిక్ సంవత్సరం (Cosmic year) సూర్యుడి పరిభ్ర మణ కాలాన్ని కాస్మి...

హబుల్ అంతరిక్ష దూరదర్శిని

Image
హబుల్ అంతరిక్ష దూరదర్శిని  (  Hubble Space Telescope ) భూ నిమ్న కక్ష్యలో తిరుగుతూ ఉన్న టెలిస్కోపు. 1990 లో  నాసా ఈ టెలిస్కోపును ప్రయోగించింది. అమెరికాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు  ఎడ్విన్ హబుల్ పేరున దీని నామకరణం జరిగింది. అంతరిక్షంలోకి పంపిన టెలిస్కోపుల్లో ఇది మొదటిదేమీ కానప్పటికీ, మిగతా వాటికంటే ఇది విస్తృతమైన కార్యకుశలత కలిగినది. దీని ముఖ్య ఉద్దేశం రోదశి లోతుల్లో ఉన్న నభోమూర్తుల అధ్యయనం. దీనిని డిస్కవరీ స్పేస్ షటిల్ ద్వారా ఏప్రిల్ 1990 లో భూ నిమ్న కక్ష్యలో ప్రవేశపెట్టారు.హబుల్ అంతరిక్ష దూరదర్శిని (Hubble Space Telescope (HST))      డిస్కవరీ తీసిన 'హబుల్ టెలీస్కోపు' చిత్రం. ప్రాథమిక దర్పణాన్ని సరైన ఆకారానికి పాలిష్ చెయ్యకపోవడంతో సరిగా ఛాయా చిత్రాలు ఇవ్వలేదు.సమస్యను సరిచేసేందుకు నాసా ఒక సర్వీసు యాత్రను తలపెట్టింది. హబుల్ ను రిపేరు చేసేందుకు, అందుకు అవసరమైన పరికరాలను ఉపయోగించడం లోను ఏడుగురు వ్యోమగాములకు లోతైన శిక్షణ నిచ్చింది. 1993 డిసెంబరులో ఎండీవర్ షటిల్ ద్వారా వారిని అంతరిక్షంలోకి పంపింది. వాళ్ళు 10 రోజుల పాటు అంతరిక్షంలో ఉం...

విశ్వమంటే ఏమిటి?

Image
విశ్వమంటే ఏమిటి?  "విశ్వానికి అవధులు లేవు, లేకపోతే దానికి అంచులనేవి ఉండితీరేవి."       ___లుక్రెటియస్('డె రేరమ్ నతూర',పదార్థాల స్వభావం )           ఆకాశంలో మనకు కనిపించే కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు, మన సౌర కుటుంబం  మొదలైన అంతరిక్ష పదార్ధాల సముదాయాన్ని విశ్వం అంటాం. విశ్వం లోని ప్రతీ అణువు కణాలతోను, కొన్ని శక్తులతోను ఏర్పడింది. అంతరిక్షం, కాలం, అన్ని రూపాల పదార్థం, బలం,గతి,భౌతిక నియమాలు వీటిని నియంత్రిస్తూ వుంటాయి. విశ్వం అనే పదానికి 'జగత్తు', 'ప్రపంచం', 'ప్రకృతి' అనే అర్థాలూ ఉన్నాయి.         విశ్వం లోని నక్షత్రాల సమూహం గురించి మానవుడు నాలుగు వేల సంవత్సరాల కిందటే అధ్యయనం చేశాడు. ప్రథమంగా సుమేరియన్లు ఆ తర్వాత బాబిలోనియన్లు పటాల ఆధారంగా వీటిని అధ్యయనం చేశారు.      మొదట భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందని, మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయని భావించారు. వేల సంవత్సరాలుగా ఇలాగే ఉంది కాబట్టి ఎలాంటి మార్పులు లేకుండా భూమి, నక్షత్రాలు, సూర్యుడు శాశ్వతంగా ఉంటాయనుకున్నారు. భూమిని చాపలాగ...