భారత వ్యాక్సిన్ చరిత్ర
ప్లేగు వ్యాక్సిన్ ని 1897లో అప్పటి బాంబేలోని గ్రాంట్ మెడికల్ కాలేజీలో వాల్డమర్ హాఫ్ కిన్స్ అనే శాస్త్రవేత్త తొలిసారిగా తనపై తానే ప్రయోగించుకున్నారు. ఆ తర్వాత బైకుల్లా జైలులోని ఖైదీలపై ప్రయోగించారు. 1899లో ప్లేగు లేబరొటరీ భారత్ లో ఏర్పాటైంది. 1948లో మద్రాస్ లోని గిండిలో బీసీజీ ల్యాబొరేటరీ ఏర్పాటైంది. 1940కి ముందే డిఫ్తీరియా, పెట్రుసిస్, టెటనస్ వ్యాక్సిన్లు భారత్ లో తయారయ్యాయి. మొట్టమొదటి జంతు వ్యాక్సిన్ డిపోను 1890 లోనే షిల్లాంగ్ లో ఏర్పాటు చేశామని, అదీ భారత సత్తా అని చెబుతున్నారు నిపుణులు. ప్రభుత్వ రంగంలో ఉన్న వ్యాక్సిన్ తయారీ కేంద్రాలన్నీ క్రమక్రమంగా మూతబడగా.. ఇప్పుడు మనం సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ అంటూ ప్రైవేటు సంస్థలపై ఆధారపడాల్సి వస్తోందని అంటున్నారు. మశూచి నివారణ ఇలా జరిగింది.. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ప్రపంచాన్నే గడగడలాడించిన మశూచి వ్యాధికి టీకా కనుగొన్న నాలుగేళ్ల తర్వాత 1802లో భారత్ లో మూడేళ్ల పిల్లవాడికి దాన్ని వినియోగించారు. 1850 వరకు ఈ వ్యాక్సిన్ భారత్ కు దిగుమతి అయింది. అయితే దీన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే లింఫ్ ద్రావణం తగినంత లేకపోవడం సమస్యగా ఉ...