Posts

Showing posts from January, 2021

నాగరికతలు వికసిస్తున్న దశలోనే ఏర్పడిన అనేక నమ్మకాలు, మూఢనమ్మకాలు.

Image
నాగరికతలు వికసిస్తున్న దశలోనే ఏర్పడిన అనేక నమ్మకాలు, మూఢనమ్మకాలు.            __ పిళ్లా కుమారస్వామి,9490122229 ఆత్మ భావన ఎలా వచ్చింది?       ఆదిమ సమాజంలో సహజ మరణాలు  దాదాపు లేవు.శత్రువుల చేతిలో నో జంతువుల బారినో పడి మనిషి మరణించేవాడు. పోరాటంలో గాయపడి సృహతప్పిన వాడికి   మరణించిన వాడికి పెద్దగా తేడా తెలిసేది కాదు. స్పృహతప్పిన మనిషి మళ్లీ మేలుకొనే వాడు‌.దాన్ని చూసి మరణించిన మనిషి కూడా తిరిగి మేల్కొంటాడని నమ్మకం ఏర్పడింది. ఇదే మనిషిలో ఏదో తెలియని ఒక అదృశ్య శక్తి ఉందనే ఒక నమ్మకం ఏర్పడడానికి కారణమయింది. అలాగే మనిషి నిద్రించే సమయంలో కలలు కంటుంటాడు .అప్పుడు కూడా మనిషి మరణించిన  వాని లాగా ఉంటాడు .మనిషి నిద్రిస్తున్నప్పుడు శరీరంలోని ఒక అదృశ్య శక్తి  బయటికి వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ నిద్ర లేవగానే శరీరం లోకి వస్తోందని భావించే వాళ్ళు. ఈ భావనే ఆత్మభావన కు దారి తీసిందన్నాడు  గ్రాంట్  అల్లెన్ తన 'ఎవవల్యూషన్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ గాడ్' లో .         జంతువులను వేటాడి ఆహారసేకరణ  మానేసి కుదురుగా ఒకచ...

భారత్‌లోకి రెండు వలసలు

అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జన్యుశాస్త్ర పరిశోధకుడు డేవిడ్ రీచ్ నేతృత్వంలోని ఒక బృందం 2018 మార్చిలో ఒక అధ్యయనం చేసింది. 'ద జినోమిక్ ఫార్మేషన్ ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏసియా' అనే శీర్షికతో వెలువడిన ఈ అధ్యయనంలో ఆశ్చర్యపరిచే అంశాలు ఉన్నాయి.గత 10 వేల సంవత్సరాల్లో భారత్‌లోకి ప్రధానంగా రెండు వలసలు జరిగాయని ఈ అధ్యయనం చెబుతోంది.         తొలుత  సుమారు 65 వేల సంవత్సరాల క్రితం  ఆఫ్రికా నుండి భారతదేశానికి వలస వచ్చారు.      రెండవ వలస నైరుతి ఇరాన్‌లోని జాగ్రోస్ ప్రాంతంలో మొదలైంది. ఇక్కడి మనుషులు మేకలను మచ్చిక చేసుకొన్నారనేందుకు తగిన ఆధారం ఆ ఊర్లోనే లభించింది. వీరు భారత్‌కు వలస వచ్చారు. వీరు పశుపోషకులు. క్రీ.పూ.9000,  3000 సంవత్సరాల మధ్య ఈ వలస జరిగి ఉండొచ్చని టోనీ జోసెఫ్ పేర్కొన్నారు. అలా జాగ్రోస్ ప్రాంతం నుంచి వచ్చినవారు ఉపఖండంలో అప్పటికే నివసిస్తున్న తొలి భారతీయులతో (వలసదారులతో)  కలిసిపోయారు. వీరిద్దరూ కలిసి సింధూ లోయ నాగరికతను సృష్టించారు.      క్రీ.పూ.  2000  తర్వాత శతాబ్దాల్లో మరో వలసదారుల సమూహం వచ్చ...

ఆదిమానవుడు నాగరిక మానవునిగా ఎదిగిన క్రమం

Image
ఆదిమానవుడు నాగరిక మానవునిగా ఎదిగిన క్రమం     ఆధునిక మానవ జాతి ఆవిర్భవించక మునుపు లక్షల సంవత్సరాల క్రితమే చాలా మానవ జాతులు విరాజిల్లాయి.        మానవ జీవిత పరిణామాలలో మొదటి మానవులను ఆస్ట్రోఫిథికస్ అన్నారు.ఆతరువాతి వారిని రామాఫిథికస్ అన్నారు.ఆ తరువాత వచ్చిన  హోమో ఎరక్టస్ మానవులు మరింత మార్పు చెంది నియాం‌డర్తల్ మానవులుగా రూపాంతరం చెందారు.ఈ జాతులన్ని మనిషి లాంటి ప్రాణులే.వీరి తరువాత వచ్చిన వారు హోమోసేపియన్లు. వీరే నేటి ఆధునిక మానవులకు పూర్వీకులు. వీరిని క్రోమాగ్నన్‌లు అని కూడా అంటారు.హోమో సేపియన్లు అనేది మానవ జాతికి పెట్టిన పేరు. ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకూ విలసిల్లిన మానవ జాతుల్లో జీవించి ఉన్న జాతి హోమో సేపియన్స్ ఒక్కటే. లాటినులో ఈ పేరుకు "వివేకవంతుడు" అని అర్ధం. లాటినులో దీనిని 1758 లో కార్ల్ లిన్నేయస్ పరిచయం చేశాడు.       హోమో సేపియన్ల మొదటి  శిలాజం ఆఫ్రికాలో లభించింది. ఇది 3,00,000 సంవత్సరాల క్రితం నాటిది. సుమారు 1,00,000 - 30,000 సంవత్సరాల క్రితాల మధ్య ఆఫ్రికా, యురేషియా రెండింటిలోనూ హోమోసెపియన్, నియాండర్తల్ జాతుల మధ్య సంకరం జరిగి...

మానవ పరిణామక్రమం

Image
మానవ పరిణామక్రమం                _పిళ్ళా కుమార స్వామి, 9490122229.             భూమి మీద ఆదిమానవుడు నేటి మానవుని దశకు చేరుకోవడానికి  చేసిన ప్రయాణం చాల సుదీర్ఘమైనది.భూమి మీద జరిగిన ప్రతి మార్పు మనిషి మనుగడలో కీలకమైన మలుపులు తీసుకొచ్చింది. అదే మనిషి జ్ఞానాన్ని పెంపొందిస్తూ వచ్చింది.        మార్పు ప్రకృతిలో నిరంతంరంగా ఉంది. అది ప్రకృతి సహజ లక్షణం. ప్రకృతిలో భాగంగా ఉన్న మనిషి ప్రవర్తన కూడా పరిస్థితులను బట్టి చెందుతూ ఉంది.        భూమి మీద ఎన్నో జీవులు పుట్టినా గత 300 కోట్ల సంవత్సరాలలో మనిషి ఒక్కడే సృజనాత్మక జీవిగా రూపొందాడు.దీనికి కారణం మనిషి మెదడు అభివృద్ధి చెందడమే. ఆ మెదడు అభివృద్ధి చెందడా నికి కారణం ప్రకృతితో మనిషి తన మనుగడ కోసం చేసిన నిరంతర పోరాట ఫలితమే. అందులో శ్రమ పాత్ర అధికంగా ఉందన్నాడు ఏంగెల్స్.         మనిషి ఒక్కో అడుగు వేస్తూ తన మెదడు అభివృద్ధి చేసుకుంటున్న దశలో అనేక కోరికలను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాడు. ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడ...

తెల్లవారుతున్నప్పుడు తూర్పు దిశలోను, సాయంత్రం వేళల్లో పడమర దిశలోను ప్రకాశవంతమైన నక్షత్రాలు కనిపిస్తాయి. అవేంటి?

తెలవారుతున్నప్పుడు తూర్పు దిశలోను, సాయంత్రం వేళల్లో పడమర దిశలోను ప్రకాశవంతమైన నక్షత్రాలు కనిపిస్తాయి. అవేంటి? తుండగా తూర్పున, సాయంత్రం పడమర దిక్కున కనిపించే నక్షత్రం ఒక్కటే. వేర్వేరు కావు. నిజానికి అది నక్షత్రం కాదు. అది శుక్రగ్రహం (వీనస్‌). అందమైన ఉజ్వలమైన కాంతిని వెలువరించడం వల్ల ఈ గ్రహానికి రోమన్‌ ప్రేమదేవత 'వీనస్‌' పేరును పెట్టారు. ఇంతటి వెలుగుకు కారణం ఈ నిర్జీవ గ్రహంపై ఉండే ప్రమాదకరమైన యాసిడ్‌ మేఘాలే. ఇవి సూర్యకాంతిని ఎక్కువగా పరావర్తనం చెందిస్తాయి. ఎంత ఎక్కువగా అంటే మనకి సూర్యుడు, చంద్రుడు తర్వాత ప్రకాశవంతంగా కనిపించేది శుక్రుడే. శుక్రుడు పరిభ్రమించే కక్ష్య భూకక్ష్య లోపల ఉంటుంది. అందువల్లనే మనం ఆకాశం వైపు చూసినప్పుడు సూర్యుడు, శుక్రగ్రహం వ్యతిరేక దిశల్లో ఉండకపోవడమే కాకుండా అర్థరాత్రివేళ అది కనిపించదు. తెల్లవారుతున్నప్పుడు, సాయం సమయాల్లో మాత్రమే కనిపిస్తుంది. అలాగే శుక్రగ్రహం సాయం వేళల్లో అస్తమించదు. తెల్లవారుజామున ఉదయించదు. సూర్యుడు ఉదయించినప్పుడు తూర్పు దిశలో, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు పశ్చిమ దిశలో మాత్రమే కనిపిస్తుంది. ఉదయాన్నే కనిపించే శుక్రగ్రహాన్ని నక్షత్రంగా భావ...

Bombay blood group

Image
The Bombay blood group is a rare blood group , phenotypes of this group lacking H antigen on the red cell membrane and have anti-H in the serum. It fails to express any A, B or H antigen on their red cells or other tissues. The existence of a human H/h genetic polymorphism was first established by Bhende et al. The Bombay blood group, also called hh , is deficient in expressing antigen H, meaning the RBC has no antigen H. For instance, in the AB blood group, both antigens A and B are found. A will have A antigens; B will have B antigens. In hh , there are no A or B antigens. This required blood donation. But the youngster has a very rare blood type. His blood is not O, A, B , or AB, but a special type called (hh)- a rare one first discovered in Bombay in 1952, and hence christened as Bombay Blood.