ఆర్యుల రాక నిజమే
ఆర్యుల రాక నిజమే? ——————————— హరప్పా ప్రజలు దక్షిణాదివారే.. వారిలో ఉన్నవి ఆ జన్యువులే ‘రాఖీగఢీ’ అస్థిపంజరం నుంచి డీఎన్ఏ సేకరించి పరీక్షించిన శాస్త్రజ్ఞులు భారతదేశంలోకి ఆర్యుల రాక నిజమేనా? నిజమంటారు కొందరు. వారు వచ్చి.. అప్పటికే ఉత్తరాదిన ఉన్నవారిని దక్షిణాదికి వెళ్లగొట్టారని చెబుతారు. ఇదంతా ఆంగ్లేయుల కుట్రని కొట్టిపారేస్తారు మరికొందరు. మరి ఎవరి వాదన నిజం? అత్యంత అధునాతనమైన డీఎన్ఏ పరిజ్ఞానాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నలకు కొంతమేరకు సమాధానం కనుగొనగలిగారు. హరప్పా నాగరికత ప్రజలకు.. దక్షిణ భారతదేశంలోని పూర్వీకులకు మధ్య జన్యు సంబంధం ఉందని తేల్చారు. ఈ నాగరికత క్షీణించిపోతున్న సమయంలో మధ్య ఆసియా నుంచి వ్యవసాయం చేసే రైతు సమూహాలు తరలి వచ్చి.. స్థానికులతో కలవటం వల్ల వారి జన్యువులు కూడా వీరిలో ఉన్నాయని తేల్చి చెప్పారు. మన భారత ఉపఖండ చరిత్రను తిరగరాసే ఈ జన్యుచరిత్రను త్వరలో అంతర్జాతీయ పత్రిక ‘సైన్స్’లో ప్రచురించనున్నారు. రాఖీగఢీ.. ఢిల్లీకి మూడున్నర గంటల దూరంలో ఉన్న ఒక చిన్న పల్లె. దాదాపు 9 వేల ఏళ్ల క్రితం నుంచి ఈ ప్రాంతంలో ప్రజలు ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకప్పటి హరప్పా-మోహంజ...