Posts

Showing posts from April, 2021

సృజనాత్మకత

Image
మొదట్లో ఇతర జంతువుల మాదిరిగా నిప్పంటే భయపడేవాడు. అది వేడిని ఇస్తుందని క్రూర మృగాలు నుండి కాపాడుతుందనే తెలుసుకున్నాక మండే అడవులనుండి అగ్నిపర్వతాల నుండి దివిటీ వెలిగించుకుని అవి ఆరిపోకుండా వంతులవారీ కాపలా కాసేవారు. మనిషి జీవితంలో నిప్పు చాలా ప్రధానమైంది. మనిషికి మాత్రమే పట్టుబడిన శక్తి అది. నాలుగు లక్షల సంవత్సరాల క్రితం మనిషిని కనుక్కున్నాడు.భారతం రచనా కాలంలో దానిని అరణి అనేవారు. నిప్పును ఉపయోగించి ఆహారం ఉడికించడం, కాల్చడం చేసేవారు . నిప్పు ఉపయోగం వలన జంతువులను లొంగదీసుకోవడం సులభమైంది. అగ్ని నాశనకారిగాకాక  పదార్థాలను మార్చివేయగల ఒక మాంత్రిక శక్తి గా భావించారు. అగ్ని నాశనం చేయదు అది పునర్జన్మ నిస్తుందని భావించేవారు .రాళ్లను పగలకొట్టడానికి , వంటకూ నిప్పును వాడినారు. లోహాల శుద్దికి వాడినారు.  దాంతో రాతి పనిముట్లు బదులు లోహపు పనిముట్లు కూడా వచ్చాయి.  అగ్నిని దేవునిగా భావించారు. నిప్పు ద్వారానే ద్వారానే మనిషి హిమయుగంలో మనుగడ సాగించగలిగాడు. ఈ విధంగా నిప్పు మానవ నాగరికతలో ప్రధాన పాత్ర వహించింది. మనిషి తన జీవిత మజిలీలో మొట్టమొదట మాంసం కోసం మాత్రమే పశువులను పెంచాడు. అయితే త్వరలోనే అ...

మన ప్రాచీనుల విజ్ఞానానికి గర్విద్దాం – వారి అజ్ఞానాన్ని అంగీకరిద్దాం

            “రండి! జోగయ్య గారూ! రండి!” లోనికి వస్తున్న మిత్రులు జోగయ్య గారిని సాదరంగా ఆహ్వానించాను.             మిత్రులిద్దరం పిచ్చాపాటీలో పడ్డాము. పిచ్చాపాటీ మధ్యలో జోగయ్య గారు “మన ఆధునిక విజ్ఞానానికి మూలాలు వేదాల్లోనే ఉన్నాయండీ. కానీ మన వాళ్ళు అది గుర్తించక, “అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష” అంటూ ఎగతాళి చేస్తున్నారండీ” అన్నారు.             “వేదాల్లో ఉన్న జ్ఞానం చాలా పరిమితమైనదండీ. వారికి బంగారము, వెండి, రాగి లోహాలను తయారు చేయడాన్ని గూర్చి (ఋగ్వేదం 1-183-1), మేడలు(ఋగ్వేదం 1-121-1), ఓడలు(ఋగ్వేదం 1-46-7) నిర్మించడాన్ని గూర్చి, ఇలాంటి ప్రాథమిక వైజ్ఞానిక అంశాలు తెలుసు. అంతే! వారికి భూమి గుండ్రంగా ఉంటుందని కానీ, అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని కానీ తెలియదు. ఉదాహరణకు ఋగ్వేదం 1-160-4 లో ఇలా చెప్పబడింది. “సకల భూతములకు సుఖములు కలిగించు భూమిని,ద్యావాను భగవానుడు సృష్టించినాడు. ఆ రెంటినీ కదలకుండా బిగించిన భగవానుడు సర్వదేవతలందు శ్రేష్టుడు”. అలాగే కృష్ణ యజుర్వేదము 1-5-11-18 లో “భూమి దేవతలు నిర్మించిన నౌక. అది మహా జల...

కామన్ సెన్స్ - దృష్టి - దిష్టి

కొన్నిసార్లు మనం చదువుకున్న చదువు మొత్తం మన గుడ్డి నమ్మకాల్లో కాలిపోతుంది.. మనకు తెలిసినంతలో 5 శాతం కూడా తెలియని వారిని గుడ్డిగా నమ్మి మనలో ఉన్న కామన్ సెన్స్ కి చంపేసుకొంటాం. సహజంగా విద్య జ్ఞానసమపార్జనకి ఉపయోగ పడుతుంది, కానీ చదువుకున్న వారు కూడా మార్కుల్లా కొంతమందిని ఫాలో అయిపోతారు. రెండు ఉదాహరణలు చెప్తాను. మిడ్ బ్రైయిన్ యాక్టివిటీ అనే స్కామ్ దేశం మొత్తాన్ని ఉపేసింది. ఇందులో మొదటి దశలో రెండు కళ్ళకి క్లాత్ కట్టి ముందు ఉన్న వస్తువులు చెప్పటం, లేక పుస్తకాన్ని చదవటం సాధ్యం అని నమ్మిస్తారు. ధ్యానం చేయటం వల్ల, మూడవ నేత్రం ఓపెన్ అయ్యి కళ్ళు కనిపించకపోయినా చూడగలరు అని చెప్తారు. రెండో దశలో ప్రక్క రూమ్ లో ఎం జరుగుతుందో కూడా చెప్తారు అంటారు. దీనికి వేలల్లో ఫీజులు తీసుకొని, కొన్ని కోట్ల వ్యాపారం చేశారు( ఆ మొదటి దశ ట్రిక్ తరువాత చర్చిస్తాను) ఈ ప్రగ్రామ్ లో బాగా చదువుకొన్న వారి పిల్లలు ఉన్నారు. రెండోది ప్రముఖ ఆధ్యాత్మిక వ్యాపారవేత్త జగ్గీ వసుదేవ్. ఇతనైతే డైరెక్ట్ గా ఐఐటీ విద్యార్థులను ఎర్రోళ్లను చేసాడు. నీటికి జ్ఞపక శక్తి ఉంటుంది అని, తాను నీటిని మంచి ఉద్దేశ్యంతో చూసి ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఆరోగ్యంగా...

This is how traditions are born

This is how traditions are born A new camp commander was appointed and while inspecting the place, he saw 2 soldiers guarding a bench. He went over there and asked them why do they guard it. "We don't know. The last commander told us to do so, and so we did. It is some sort of regimental tradition!" He searched for last commander's phone number and called him to ask him why did he want guards in this particular bench. "I don't know. The previous commander had guards, and I kept the tradition." Going back another 3 commanders, he found a  100-year old retired General. "Excuse me sir. I'm now the CO of your camp you commanded 60 years ago. I've found 2 men assigned to guard a bench. Could you please tell me more about the bench?" "What? Is the paint still wet ?!?"

12 ఏప్రియల్ , అంతరిక్షయాత్రదినోత్సవం

12 ఏప్రియల్ 1961 అంతరిక్ష పరిశోధనలలోనే ఒక మైలురాయి.మొట్టమొదటి సారిగా అంతరిక్షంలోకి మనిషిని ప్రవేశపెట్టిన రోజు మానవుడు సాధించలేనిది ఏమి లేదని చాటిచెప్పిన రోజు.1961సంవత్సరం అంతరిక్ష పరిశోధనలలో సోవియెట్ రష్యా  దూసుకుపోతుంది. తమ పరిశోధనలను మరింత విస్తరించాలని భావించి 1950 సంవత్సరం మనుషులను అంతరిక్షంలోకి పంపే ప్రోజెక్ట్ ను ప్రారంభించింది.ఇందులో భాగంగా అంతరిక్షంలోకి పంపడానికి వారియొక్క శిక్షణ కోసం సోవియెట్ అంతరిక్ష సంస్ధ సోవియెట్ రష్యాకు చెందిన వాయుసేన నుండి  20 మంది  పైలెట్ లతో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది వీరికి  శిక్షణ ఇస్తూ ఎంపికలో భాగంగా చివరకు *yuri gagarin* అనే వ్యక్తిని ఎంపిక చేశారు.యూరీ గగారిన్ 9 మార్చి ,1934 సంవత్సరంలో రష్యాలో ఒక పేదరిక కుటుంబంలో  జన్మించాడు. చిన్నప్పటినుండి ఎన్నో కష్టాలు పడి రష్యా వాయుసేనలో చేరాడు. అంతరిక్ష యాత్ర ఎంపిక అయిన తరువాత cosmonaut గాశిక్షణ పొంది తక్కువ ఎత్తు ఉండటం శిక్షణలో మెరుగైన ప్రతిభ కనబరచడం వలన  మొట్టమొదటి అంతరిక్ష యాత్రకు ఎంపికయ్యాడు.cosmonaut అంటే రష్యా పంపించే వ్యామగాములను cosomonauts అని అంటారు.12 ఏప్రియల్ 1961 తేది...

విజ్ఞాన సంబంధ పుస్తకాలు

విజ్ఞానము సంబంధ 58  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు ------------------------------------------------ నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం www.freegurukul.org/g/Vignanam-1 మీకు తెలుసా? www.freegurukul.org/g/Vignanam-2 నిత్య జీవితంలో సైన్స్ www.freegurukul.org/g/Vignanam-3 అతీత శక్తులు-అద్బుత వాస్తవాలు www.freegurukul.org/g/Vignanam-4 సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము www.freegurukul.org/g/Vignanam-5 స్కూల్ విద్యార్ధులకు కంప్యూటర్ www.freegurukul.org/g/Vignanam-6 సర్వే గణిత చంద్రిక www.freegurukul.org/g/Vignanam-7 గృహ విజ్ఞాన శాస్త్రం-ఆహార పదార్ధాలు పోషణ www.freegurukul.org/g/Vignanam-8 ఓషధి శాస్త్రము www.freegurukul.org/g/Vignanam-9 కోళ్ళ పెంపకం www.freegurukul.org/g/Vignanam-10 శాస్త్రజ్ఞుడివి అవుతావా ? www.freegurukul.org/g/Vignanam-11 శాస్త్ర పరిశోదనలు www.freegurukul.org/g/Vignanam-12 ఓషధీ భూజములు www.freegurukul.org/g/Vignanam-13 వ్యవసాయ శాస్త్రము www.freegurukul.org/g/Vignanam-14 వింత ప్రపంచం www.freegurukul.org/g/Vignanam-15...

డా. అబ్రహాం కోవూరు విసరిన సవాలు

Image
        Dr.Kovur Abraham మహిమలను, మంత్రాలను సవాలు చేస్తూ ప్రముఖ హేతువాది డా. అబ్రహాం కోవూరు విసరిన సవాలు తెలుగులో ******************************************                 డా|| అబ్రహం టి. కోవూర్‌ 1963లో విడుదల చేసిన ప్రకటన (ఛాలెంజ్‌) ఈ విధంగా వుంది. నేను అబ్రహం టి కోవూర్‌, తిరువల్ల, పమన్‌కడ వీధి, కొలంబో-6 చిరునామాలో నివసించే వ్యక్తిని ఈ ప్రకటన చేస్తున్నాను. మానవ దేవుళ్లు, సన్యాసులు, యోగులు, సిద్ధులు, అమ్మలు, దేవతలు ఎవరైనా సరే మా వైజ్ఞానిక పరిశీలకులకు సహకరిస్తూ వారి వారి మహిమలు, దైవ శక్తులు, మాయలు, మంత్రాలు, అతీంద్రీయ శక్తులు, మానవాతీత అద్భుతాలు నిరూపించుకుంటే శ్రీలంక కరెన్సీలో వంద వేలు బహుమతిగా ఇస్తాను. ఇందులో మోసాలు, గిమ్మిక్కులు, మభ్యపెట్టడాలు ఉండకూడదు. వాస్తవంగా, నిజాయితీగా చేసి చూపాలి. అది వారి తపస్సు వల్ల లభించిందో, ఆధ్యాత్మిక చైతన్యం వల్ల అబ్బిందో, పుట్టుక తోనే ఉందో ఏమైనా కావొచ్చు. వైజ్ఞానిక పరీక్షలకు లోబడి పరీక్షలో పాల్గొనాల్సి వుంటుం ది. ఈ ఛాలెంజ్‌ నేను చని పోయే దాకా వుంటుంది. లేదా అతీంద్రియ శక్తులు నిరూపిం...

అసలు కుంకుమ ఎందుకు తయారైంది

పూర్వం యజ్ఞాలు చేసేటప్పుడూ, గృహప్రవేశాలు వ్రతాలు, పెళ్ళిళ్ళవంటి ఏ శుభకార్యాలు చేసినా జంతువుల్ని బలి ఇవ్వడం సర్వసాధారణమైన విషయం. యజ్ఞాలలో అయితే వందల వందల గుర్రాలు, ఆవులు, మేకలు మొదలైన జంతువుల్ని బలి ఇచ్చేవారు. మనిషి కోరికలు తీరడానికీ, సంతోషాన్ని తెలియజేయడానికీ, దుష్టశక్తుల దిష్టి తగలకుండా ఉండాలంటే రక్తపాతం జరగాల్సిందే. ఆ రక్తాన్ని నుదుటికి రాసుకుని వీరులుగా ఫోజుకొట్టేవారు. జంతువుల పేగులు వేలాడదీసుకుని మాంసాన్ని పీక్కుతినేవారు. ఈ హింసను భరించలేక బుద్ధుడు జీవహింస మహాపాపం అని తన మతం ద్వారా ప్రచారం చేశాడు. జంతుబలిని నిషేధించాలి అని చెప్పాడు. ఆ మాటలు చాలా మందిని ఆకర్షించి బౌద్ధం వైపు నడిపించాయి బౌద్ధం వల్ల హిందూ మతం అంతరించిపోయే ప్రమాదముందని భయపడిన బ్రాహ్మణులు బుద్ధుడికంటే ఒక అడుగు ముందుకేసి జంతువులను బలివ్వడం ఆపేశారు.