Posts

Showing posts from July, 2021

తాత్విక దృక్పథం

తాత్విక దృక్పథం           @పిళ్లా కుమారస్వామి ,9490122229 ప్రతిమనిషికి తన అనుభవాల ద్వారా ఒక దృక్పథం అంటూ ఏర్పడుతుంది. ఏళ్లతరబడి పాతుకుపోయిన విశ్వాసాలు, శాస్త్ర విజ్ఞానం అందించిన జ్ఞానం ఆధారంగా ఒక తాత్విక దృక్పథం బాధ్యతలు తీరిపోయిన వారికి, ముసలివారికి మాత్రమే ఏర్పడేది కాదు. ఉదాహరణకు ఈ సమాజం మారదు. అదృష్టం ఎంతటిదైనా సాధించవచ్చు. తలరాతను తప్పించలేం! లాంటివన్ని ప్రతిమనిషికీ ఏదో ఒక సమయంలో ఏర్పడే భావాలే. అయితే అనుభవాల ద్వారా కొన్ని భావాలను మార్చుకుంటూ మరికొన్ని కొత్త భావాలను ఏర్పరచుకుంటూ తాత్విక దృక్పథాన్నిఅలవర్చుకుంటాడు. సమాజంలో వస్తున్న మార్పుల మీద పరిస్థితుల మీద ఇది ఆధారపడి ఉంటుంది. నేటి సమాజంలో రెండు దృక్పథాలు గల మానవులు ఉన్నారు. వీరిని పరిశీలిద్దాం. ఒక వ్యక్తి లాటరీ కొంటాడు. అదృష్టం బాగుంటే లాటరీ తగులుతుంది కదా అంటాడు. డబ్బు వచ్చే 'అదృష్టం' ఉంటే లాటరీ కొనకపోయినా డబ్బు ఆ వ్యక్తికి రావాలి కదా! లాటరీ టికెట్టు ఎందుకు కొనాల్సి వచ్చింది? అదృష్టం ఉంటే లాటరీ తగులుతుందని అనుకోవటం భావవాదం. అంటే కేవలం మానసికంగా భావించేది మాత్రమే. ఇది ఎక్కడా ఆచరణలో కనిపించని భావం. లాటరీ టికె...

శాస్త్రీయ ఆలోచన

శాస్త్రీయ ఆలోచన              ___ పిళ్లా కుమారస్వామి,9490122229     ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది? ప్రకృతి ఎలా ఆవిర్భవించింది?. మనిషి ఎలా భూమి పై ఎలా పుట్టాడు?మనిషి మరణం తర్వాత ఏమవుతుంది? పుట్టుక మరణం మధ్య జీవితం లో  ఎలా వ్యవహరించాలి?  ఇలాంటి ప్రశ్నలు ప్రతి మానవుని మదిని ఏదో ఒక సమయంలో తొలుస్తూ నే ఉన్నాయి. వీటికి చాలా వరకు సమాధానాలు లభించాయి.      మనిషి తన మనుగడకు ప్రకృతిలో సంఘర్షణ పడేవాడు. తొలిదశలో ప్రకృతి శక్తుల మర్మం అంతుచిక్కేది కాదు. దాంతో మనిషి ఏదో ఒకటి ఊహించుకునే నైజం ఉండేది. ఏమీ తెలియని దశలో మనిషి ప్రపంచాన్ని గురించి కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకున్నాడు. వర్షాన్ని వరుణదేవునిగా, అగ్నిని అగ్నిదేవుడుగా, గాలిని వాయుదేవునిగా భావించి, వాటి ఆగ్రహాన్ని తట్టుకునేందుకు లేదా కరుణకొరకు ప్రార్ధనలు చేయడం లేదా గానం చేయడం నేర్చుకున్నాడు. ప్రపంచాన్ని ఎవరో నియంత్రిస్తున్నారనే భావం ఏర్పడింది. అందుకనే భూమిని, మనిషిని ఒకటేమిటి సకల చరాచర జగత్తునంతా భగవంతుడు సృష్టించాడనే భావం ఏర్పడింది. బైబిలు మనుష్యుల దేవుని సృష్టి గురించి వివరిస్తూ, ఆదికాండ...

గ్రహాలు

బుధ గ్రహం        బుధుని ఇంగ్లీషులో 'మెర్క్యురీ' అంటారు. తారా(చుక్క) చంద్రులకు పుట్టినవాడు బుధుడని బ్రహ్మ పురాణంలో రాశారు. వేదాలలో అగ్ని కుమారుడన్నారు.ఇతరపురాణాల లో కార్తికేయుడు కుమారుడని రాశారు.బుధునికి కుమారుడనే  పేరు కూడా ఉంది. అదే గ్రీకు పురాణాల్లో  అతను బృహస్పతి (గురుడు)కి పుట్టినట్లు రాశారు.ఆనాటి కవుల ఊహలు అలా ఉండేవి. మనిషిని గ్రహానికి ప్రతీకగా చేశారు.         ఇప్పుడున్న ఎనిమిది గ్రహాల్లో బుధగ్రహం అతి చిన్నది. సూర్యునికి అతి దగ్గరలో వుంది. చంద్రునికన్నా ఇది కాస్త పెద్దది. ఆకాశంలో మనం చూసినప్పుడు బుధగ్రహం ఎప్పుడూ సూర్యునికి తోకలా అంటి పెట్టుకుని తిరుగుతుంది. దానికి కారణం అది సూర్యునికి చేరువలో ఉండడమే. అందుకనే బుధగ్రహం రాత్రివేళ కనిపించదు. సూర్యోదయమప్పుడు తూర్పులో, సాయంసంధ్యా సమయంలో పడమరలో దిగంతం నిర్మలంగా ఉంటే బుధుడు కనిపిస్తాడు.       సూర్య కుటుంబంలో అతి చిన్నది,సూర్యుడికి అతి సమీపంలో ఉండేగ్రహం బుధుడు గ్రహం. బుధ గ్రహం  88 రోజులలో సూర్యప్రదక్షణం ముగిస్తుంది.       1973లో అమెరికా పంపిన మెరైనర్-10 అనే...

చంద్రుడు

భూమిని  శుక్రగ్రహ పరిమాణంలో ఉన్న ఖగోళ వస్తువు ఢీకొనడంతో ఏర్పడిన శకలాల నుండి భూమిని  శుక్రగ్రహ పరిమాణంలో ఉన్న ఖగోళ వస్తువు ఢీకొనడంతో ఏర్పడిన శకలాల నుండి  చంద్రుడు  ఏర్పడింది. ఈ ఘటన సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందట, సౌరవ్యవస్థ రూపుదిద్దుకున్న 2 - 10 కోట్ల సంవత్సరాల తరువాత జరిగింది. గుద్దుకున్న ఖగోళ వస్తువును  థీయా  అనే గ్రీకు పురాణాల్లోని దేవత పేరిట పిలుస్తున్నారు. చంద్రశిలలపై జరిపిన విశ్లేషణపై 2016 లో తయారు చేసిన నివేదిక ప్రకారం ఈ ఘాతంలో రెండు ఖగోళ వస్తువులు సూటిగా ఢీకొన్నాయని, తద్వారా రెండు వస్తువులూ ఒకదానిలో ఒకటి బాగా మిళితమై పోయాయి. సముద్రాలలో అలలు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్లే ఏర్పడతాయి.             చంద్రుడిపై మొదటగా నీల్ ఆర్‌‌మస్ట్రాంగ్, ఎడ్వి న్ ఆల్డ్రిన్, మైఖేల్ కోలిన్‌‌సలు కాలుమోపారు. రష్యా 1959లో తొలిసారి చంద్రుడిపైకి  లూనార్-1, లూనార్-2 ఉపగ్రహాలను పంపింది. అమెరికా పంపిన అపోలో-2 చంద్రుడిపై దిగిన సంవత్సరం -1969 జూలై 21. ఏర్పడింది. ఈ ఘటన సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందట, సౌరవ్యవస్థ రూపుదిద్దుకున్న...

మానవవాదానికి పెద్ద అడ్డంకి

అంతర్జాతీయ మానవవాదానికి పెద్ద అడ్డంకి ఏవంటే జాతీయ రాజ్యాలు, జాతీయవాదం ముదిరి పాకానపడితే అది క్రమంగా ఫాసిజంగా మారుతుందని మేధావులు కొంతమంది ఆమోదిస్తున్న విషయమే. మనుషులు సమిష్టిగా ఏ కారణాన కూడినా ఆ సమిష్టిలో భాగమైతే క్రమంగా హేతుబద్ధచింతన. తగ్గి వ్యక్తులుగా వారు ఆలోచించడమని గుంపు మనస్తత్వానికి బానిసలవతారు. మనవాడు చేస్తే రైటు, పరాయివాడు చేస్తే రాంగు అనే సూత్రానికి చేరితే అది ఫాసిజంగా మారినట్లే. మనుషులను ఎంత మంచి కారణంతోనైనా సంకుచిత సమిష్టులుగా విభజన చేయడమంటే మానవత్వానికి ఎదురు నిలవడమే అని. గుర్తించాలి. అందువల్ల అంతర్జాతీయత అంతర్మానవతగా మారాల్సిన చారిత్రాత్మక అవసరమొచ్చింది.

ఆవిష్కరణల క్రమానుగతం

1905 ఐన్స్టీన్ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం, 1915లో సాధారణ సాపేక్ష సిద్ధాంతం వాస్తవ పరిశీలనలతో రుజువౌతూ కొనసాగాయి. 1900 నుంచే జీవకణాల్లోని జీన్స్ అధ్యయన జన్యుశాస్త్రంగా బయలుదేరి జన్యు ఇంజినీరింగ్ సాంకేతికతను ఆవిష్కరణ జరిగింది. మ్యాక్స్ ప్లాంక్ 1900లలోనే క్వాంటమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 1911లో పరమాణు కేంద్రక ఆవిష్కరణను రూధర్ఫర్డ్ చేశారు. 1912లో కాస్మిక్స్ ఆవిష్కరణను హెస్ చేశారు. 1912 బూ ఖండాల కదలిక సిద్ధాంతాన్ని వెగ్నర్ చేశారు. 1914లో మెదడు పనితనాన్ని ప్రభావితం చేసే న్యూరోట్రాన్స్మిటర్ల ఆవిష్కరణను డేల్, బర్గర్, లోవి చేశారు. 1918 తర్వాత జెనిటిక్ థీరాని, ప్రకృతివరణం ద్వారా జీవపరిణామ సిద్ధాంతంలో ఫిషర్, హాల్డేన్, రైట్లు మేళవించారు. నియో డార్వినిజం ఆవిర్భవించింది. 1921లో ఇన్సులిన్ ఉత్పత్తిని బాంటింగ్, చెస్ట్లు చేశారు. 1923లో హబుల్ గెలాక్సీలను వర్ణించి వివరించారు. 1925లో మానవ పూర్వ జీవుల పూర్వజీవి ఆస్ట్రలో పిథికస్ ఆఫ్రికానస్ ను డార్ట్ వివరించాడు. 1925 పదార్ధం అలవంటిదని డావిసన్, జర్మర్లు ప్రకటించారు. 1928లో ఫ్లెమింగ్ పెన్సిలిన్ను కనుగొన్నారు. విశ్వం విస్తరిస్తోందని హబుల్ ఐన్స...

కార్బన్ డేటింగ్ పద్దతి ద్వారా పురాతన వస్తువుల వయసు ఎలా కనుగొనవచ్చు..?

కార్బన్ డేటింగ్ పద్దతి ద్వారా పురాతన వస్తువుల వయసు ఎలా కనుగొనవచ్చు..? సాధారణంగా ఒక కార్బన్ అణువులో 6 ప్రోటాన్లు 6 న్యూట్రాన్లు ఉండటం వల్ల మనం దానిని కార్బన్12 అని అంటారు..అయితే ఈ కార్బన్ లో ప్రోటాన్లు న్యూట్రాన్లు సమంగా ఉండటం వలన ఇది స్థిరంగా ఉంటుంది. వాతావరణం లోని నైట్రోజన్ అణువులను కాస్మిక్ రేస్ తాకినప్పుడు ఈ నైట్రోజన్ అనేది 6 ప్రోటాన్లు 8 న్యూట్రాన్లు గల ఒక కార్బన్ అనువుగా మారిపోతుంది దీనిని అప్పుడు కార్బన్ 14 అంటారు ఇందులో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్య తేడా ఉండటం వలన ఇది అస్థిరంగా(unstable) ఉంటుంది. మొక్కలు వాతావరణం లోని కార్బన్ ని తీసుకుంటాయి కనుక ఈ కార్బన్ అణువులు మొక్కలోకి వెళతాయి..మనుషులు జంతువులు మొక్కలను ఆహారంగా తీసుకోవడం వలన ఈ అణువులు మనలోకి చేరతాయి. కాబట్టి మనందరిలోను కార్బన్ 14 మరియు కార్బన్ 12 ఉంటాయి. అయితే ప్రతి 1ట్రిలియన్ కార్బన్12 అణువులకు గాను ఒక కార్బన్14 అణువు మాత్రమే ఉంటుంది అంటే ఇక్కడ నిష్పత్తి 1ట్రిలియన్ : 1 అన్నమాట. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి జీవిలో కానీ వాతావరణంలో కానీ ఇదే రేషియో లో కార్బన్12 మరియు కార్బన్ 14 అణువులు ఉంటాయి. ఒక జీవి బ్రతికి ఉన్నంతకాలం కూడా ...

హేతువాది బి.ప్రేమానంద్

Image
హేతువాది బి.ప్రేమానంద్       వీరి పేరు వింటే బాబాలు హడల్.  మహత్యాలన్నీ ట్రిక్కులేనని, మహత్యాలున్నాయని రుజువు చేసిన వారికి లక్ష రూపాయల బహుమానం అని నలభై ఏండ్ల క్రిందటనే ఛాలెంజ్ చేసిన ప్రముఖులు వీరు. విభూతి, ఉంగరాలు యిచ్చే స్వాములను మాకు అవేవీ వద్దు గుమ్మడికాయ యివ్వమన్నారు. కానీ ఎవ్వరూ యివ్వలేకపోయారు కారణం అది చేతిలో పట్టదు కనుక.అలా ఛాలెంజ్ చేసిన వ్యక్తే  ప్రేమానంద్.         పొడవాటి నెరసిన గెడ్డం, జుట్టుతో   రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుకు తెస్తారాయన. ఆయనతో చేతులు కలిపిన అందరికీ విభూతి యిచ్చేవాడు.   ప్రేమానంద్ గారిది మొండి పట్టుదల. చివరి రోజుల్లో (Stomach Can cer) పొట్టకు క్యాన్సర్ సోకి మూడు భాగాలు పొట్ట తీసేసిన తర్వాత 76 ఏళ్ల వయసులో కూడా ఆయన అదేపట్టుదలతో వుండేవారు.  ఆయన పోరాట పటిమ (Fighting Spirit) స్పూర్తిదాయకం. ఆ పట్టుదలతోనే  అనంతపురం జిల్లాలో వివిధ ప్రాంతాలలో సభలు నిర్వహించడంతో పాటు మహత్యాల బండారంపై వర్క్షాపులు నిర్వహించారు. ఎందరో యువకులకు శిక్షణ యిచ్చారు. బహిరంగ సభల్లో తన కార్యక్రమం నిర్వహించే...

జాతకం కాదు... జన్యుక్రమం చూడండి

Image
        pc sakshi daily ఇప్పటి వరకు మేనరికం పెళ్లిళ్లు వద్దని చెప్పిన శాస్త్రవేత్తలు.. ఇప్పుడు ఒకే కులంలో పెళ్లిళ్ల విషయంలోనూ జాగ్రత్తలు అవసరమని హెచ్చరిస్తున్నారు. భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లోని వేర్వేరు జన సమూహాల్లో అరుదైన కొన్ని జన్యు వ్యాధు లు ఉన్నాయని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలి క్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) అధ్యయనంలో తేలింది. ఇందుకు ఒకే కులానికి చెందిన వారితో పెళ్లి చేసుకోవడంతో వారి పిల్లలకు ఈ వ్యాధులు వచ్చే అవ కాశం ఉందని స్పష్టం చేసింది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లోని దాదాపు 2,800 మంది జన్యువులను విశ్లేషించడం ద్వారా ఈ అంచనాకొచ్చినట్లు సీసీఎంబీ శాస్త్రవేత్త కె.తంగరాజ్‌ మంగళవారం తెలిపారు. పరిశోధన వివరాలు ఇలా ఉన్నాయి..   దక్షిణాసియాలో దాదాపు 5,000 వరకు ప్రత్యేక జనసమూహాలు ఉన్నాయి. వీరిలో చాలామంది కులాంతర వివాహాలు చేసుకోరు. వీరిలో కొన్ని అరుదైన జన్యువ్యాధులు ఉన్నట్లు స్పష్టమైంది. ఉదాహరణకు ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి శస్త్రచికిత్సల సమయంలో ఇచ్చే మత్తు మందు పనిచేయదు. కోస్తా ప్రాంతానికి చెందిన ఓ వర్గ ప్రజలకు గుండెజబ్బులు వ...